రూ. 2 వేల కోట్లను దోచుకునేందుకు సోనియా ప్రయత్నించారు: బండి సంజయ్

  • నేషనల్ హెరాల్డ్ ద్వారా దేశ సంపదను దోచుకునేందుకు కాంగ్రెస్ సిద్ధమయిందన్న సంజయ్
  • నేషనల్ హెరాల్డ్ కేసు బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటిది కాదన్న కేంద్ర మంత్రి
  • యూపీఏ హయాంలోనే సీబీఐ దర్యాప్తు మొదలయిందని వెల్లడి
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. రూ. 2 వేల కోట్ల ప్రభుత్వ సంపదను కాజేసేందుకు సోనియాగాంధీ ప్రయత్నించారని ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ ద్వారా దేశ సంపదను దోచుకునేందుకు కాంగ్రెస్ సిద్ధమయిందని అన్నారు. 

ఈ కేసు బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటిది కాదని... 2011లో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడే సీబీఐ దర్యాప్తు మొదలయిందని చెప్పారు. ఆ సమయంలోనే సోనియా, రాహుల్ బెయిల్ పొందారని తెలిపారు. ఈ కేసుతో బీజేపీకి సంబంధం లేదని అన్నారు. తప్పు చేసిన వారు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారని చెప్పారు.

Sonia Gandhi
National Herald Case
Bundi Sanjay
Congress
BJP
2000 Crore Rupees Scam
UPA Government
CBI Investigation
Indian Politics
Rahul Gandhi

More Telugu News